Monday, October 25, 2010

బ్రిటన్‌లో భారత్ నిపుణులపై ఆంక్షల ఎత్తివేత

లండన్,అక్టోబర్ 25: ఐరోపాయేతర దేశాల నిపుణులను తమ కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సూచనప్రాయంగా తెలిపారు. నిపుణుల సంఖ్యపై విధించిన పరిమితి గురించి పునరాలోచిస్తామన్నారు. భారత్‌తో పాటు ఈ దేశాలకు చెందిన నిపుణులను ఏడాదికి 24,100 మందిని మాత్రమే నియమించుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనిపై కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కామెరాన్ సోమవారం ఈ ఆందోళనపై స్పందించారు. ‘వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల సేవలను వినియోగించుకోడానికి ఇబ్బంది లేకుండా చూస్తాను’ అని హామీ ఇచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...