బ్రిటన్‌లో భారత్ నిపుణులపై ఆంక్షల ఎత్తివేత

లండన్,అక్టోబర్ 25: ఐరోపాయేతర దేశాల నిపుణులను తమ కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సూచనప్రాయంగా తెలిపారు. నిపుణుల సంఖ్యపై విధించిన పరిమితి గురించి పునరాలోచిస్తామన్నారు. భారత్‌తో పాటు ఈ దేశాలకు చెందిన నిపుణులను ఏడాదికి 24,100 మందిని మాత్రమే నియమించుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనిపై కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కామెరాన్ సోమవారం ఈ ఆందోళనపై స్పందించారు. ‘వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల సేవలను వినియోగించుకోడానికి ఇబ్బంది లేకుండా చూస్తాను’ అని హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు