Friday, October 29, 2010

ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన అలిపిరి కేసు

తిరుపతి,అక్టోబర్ 29: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై అలిపిరి దాడికేసు నిందితులపై నేరం రుజువైందని అడిషనల్ సెషన్స్ కోర్టు నిర్థారించింది. 2003 సంవత్సరంలో చంద్రబాబుపై జరిగిన బాంబుదాడి కేసు విచారణ ఏడేళ్లపాటు కొనసాగింది. మొత్తం 76మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం  తుది తీర్పు వెల్లడించింది. మావోయిస్టు నేత సాగర్ అలియాస్‌పాండురంగారెడ్డితో సహా మరో ముగ్గురిని కోర్టు నిందితులుగా గుర్తించింది. వీరి ఏడేళ్ల జైలుతో పాటు, రెండువేల రూపాయల జరిమానా విధించింది. ఈకేసులో మొత్తం 33మందిని గుర్తించగా పట్టుబడినవారు మాత్రం నలుగురు. వారిలో మావోయిస్టు నేత సాగర్, నారాయణస్వామి, నాగార్జున, గంగిరెడ్డి ఉన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...