ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన అలిపిరి కేసు

తిరుపతి,అక్టోబర్ 29: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై అలిపిరి దాడికేసు నిందితులపై నేరం రుజువైందని అడిషనల్ సెషన్స్ కోర్టు నిర్థారించింది. 2003 సంవత్సరంలో చంద్రబాబుపై జరిగిన బాంబుదాడి కేసు విచారణ ఏడేళ్లపాటు కొనసాగింది. మొత్తం 76మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం  తుది తీర్పు వెల్లడించింది. మావోయిస్టు నేత సాగర్ అలియాస్‌పాండురంగారెడ్డితో సహా మరో ముగ్గురిని కోర్టు నిందితులుగా గుర్తించింది. వీరి ఏడేళ్ల జైలుతో పాటు, రెండువేల రూపాయల జరిమానా విధించింది. ఈకేసులో మొత్తం 33మందిని గుర్తించగా పట్టుబడినవారు మాత్రం నలుగురు. వారిలో మావోయిస్టు నేత సాగర్, నారాయణస్వామి, నాగార్జున, గంగిరెడ్డి ఉన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు