Monday, October 25, 2010

ఏడుకొండల వెంకన్న గెటప్ లో రోశయ్య!

 

హైదరాబాద్,అక్టోబర్ 25; పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చిన్నకూరగాయల మార్కెట్ వద్ద ఆమె అభిమానులు ఏర్పాటుచేసిన బ్యానర్ చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీబ్యానర్‌లో ఒక వైపున ఉషారాణి ఫొటో ,మరోవైపు శ్రీవెంకటేశ్వరస్వామిని పోలివుండే విధంగా ముఖ్యమంత్రి కె.రోశయ్య ఫొటో ముద్రించారు. శ్రీవెంకటేశ్వరస్వామి కిరీటం, శంఖుచక్రాలు మధ్యలో రోశయ్య ఫొటోను పొందుపర్చారు. ఈ ఫ్లెక్సీ బ్యానర్ సోమవారం ఎలక్ట్రానిక్ మీడియా కంటబడడంతో రాష్టవ్య్రాప్తంగా చ ర్చనీయాంశమైంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఆందోళన వ్యక్తమైంది. టీవీలో ప్రచారం కావడంతో బ్యానర్‌ను తొలగించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...