కామన్వెల్త్ కాంట్రాక్టు కంపెనీలపై ఐటీ దాడులు

న్యూఢిల్లీ,అక్టోబర్ 28: కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోంది. క్రీడల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును ఆదాయపు పన్నుశాఖ వేగవంతం చేసింది. క్రీడలకు సంబంధించి వివిధ పనులు చేసిన కాంట్రాక్టు కంపెనీలపై గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. 300 మంది అధికారులు దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు చేసి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు