గాయకుడు జేసుదాసు ప్రత్యేక పాత్రలో ‘క్లియోపాత్ర’
ప్రముఖ గాయకుడు జేసుదాసు తొలిసారిగా వెండితెర మీదకు వస్తున్నారు. ఆయన ప్రత్యేక పాత్రలో రాజన్ శంఖరాడి దర్శకత్వంలో ‘క్లియోపాత్ర’ పేరుతో ఓ చిత్రం రూపొందబోతోంది. సందేశాత్మక కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో టి.కె.నాయర్ నిర్మించనున్నారు. నవంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం ‘‘స్ర్తీ లోని అత్యద్భుతమైన అందాన్ని, భారతదేశంలో ఆమెకు వున్న గొప్ప స్థానాన్ని చాటి చెప్పే ఈ చిత్రం ద్వారా స్త్రీలోని ఏడు అందాలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామని, ముగ్గురు నాయికలు నటిస్తున్న ఈ చిత్రంలో ‘క్లియోపాత్ర’ ఎవరనేది సస్పెన్స్గా వుంటుందని, హైదరాబాద్, పాలకోడ్, ఊటి, యూరప్లలో చిత్రీకరణ చేస్తామని నిర్మాత తెలిపారు.
Comments