‘జీవన్‌దాన్’ పథకాన్ని ప్రారంభించనున్న ఆంధ్ర

హైదరాబాద్,అక్టోబర్ 21:  రాష్ట్ర ముఖ్యమంత్రి  రోశయ్య  తన అవయవాలను దానం చేశారు. గురువారమిక్కడ జరిగిన ఇండియన్ సోసైటీ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంYఏషన్ (అవయవాల మార్పిడి) జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన తన మరణానంతరం అవయావాలను దానమిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఓ ప్రమాణపత్రంలో ఆయన సంతకం చేశారు. అవయావాల దానం వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యప్రజలకు వివరించేందుకు, అవయవాల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించేందుకు ‘జీవన్‌దాన్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. బ్రైన్ డెత్(మెదడు చచ్బుబడిపోవడం) కేసుల్లో అవయవమార్పిడికి కావాల్సిన ప్రమాణ పత్రం తీసుకోవడం, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం జీవన్‌ధాన్ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు