ఉస్మానియా విధ్యార్ధులకు కే.సీ.ఆర్. ఎర ?

శ్రీక్రి ష్ణ  కమిటీ నివేదిక  తనకు  అనుకూలంగా రాని పక్షంలో డి సెంబర్ 31 తర్వాత చేపట్టవలసిన ఆందోళనకు తన భాషలో యుద్దానికి  కే.సీ.ఆర్.  వ్యూహరచనలో నిమగ్నమైనట్టు  కనబడుతోంది. తెలంగాణా ప్రజలు  తనకు ఎంతవరకు కలసి వస్తారో అనే అపనమ్మకంతో కాబోలు ఆయన  తెలంగాణా విధ్యార్ధులకు ముఖ్యంగా ఉస్మానియా విధ్యార్ధులకు ఎర వేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహంలొ భాగంగా ఆయన టీ.ఆర్.ఎస్. విధ్యార్ధి విభాగనికి తమ పార్టీ ఆఫీస్ తెలంగాణా  భవన్ లో  శాశ్వత  కార్యాలయాన్ని సమకూర్చారుట.  టీ.ఆర్.ఎస్.వీ. నాయకుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ ను పార్టీ పోలిట్ బ్యూరో లొ చేర్చు కోవడంతో పాటు మరో ఉస్మానియా విధ్యార్ధి సుమన్ కు     పర్టీ పదవి కట్టబెట్టారు. అంతే కాదు, కొద్దిమంది విధ్యార్ధి నాయకులు వివిధ ప్రాంతాలలో పర్యటించి ఉద్యమ్మాన్ని ఉద్ధ్రుతం   చేసేందుకు వారికి ఇన్నోవా కార్లను కూడా కే.సీ.ఆర్. కానుకగా ఇస్తునట్టు తాజా సమాచారం. అంతేనా..వుస్మానియా విధ్యార్ధులు రెగ్యులర్ గా తెలంగాణా భవన్ నుంచి ముడుపుల మూటలు అందుకుంటున్నారన్నది కొసమెరుపు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు