విశాఖ వన్ డే లో భారత్ గెలుపు

Kohli takes India to victoryవిశాఖపట్నం,అక్టోబర్ 20: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్లు తేడాతో గెలిచింది. 290 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఇంకా ఓవర్ మిగిలి వుండగానే విజయం సాధించింది. భారత్ ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ నిరాశ పరిచినప్పటికీ విరాట్ కోహ్లి ,రైనా,యువరాజ్ సింగ్ జట్టు విజయంలో కీలక బాధ్యత పోషించారు. విరాట్ కోహ్లి (110) పరుగులతో ఆసీస్‌ను బెంబేలెత్తించగా , ఫామ్‌తో తంటాలు పడుతున్న యువరాజ్ ఆఫ్ సెంచరీ చేసి తన సత్తాను నిరూపించుకున్నాడు.యువరాజ్ నిష్ర్కమించిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రైనా స్ట్రోక్ ప్లేతో మరింత రెచ్చిపోయాడు. కోహ్లి-రైనా జంట ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. రైనా కేవలం 47బంతుల్లోనే 71 పరుగులు చేసి జట్టును విజయం ముంగిట నిలిపాడు. దీంతో భారత్ 1-0 ఆధ్యిక్యం సాధించి సిరీస్‌పై కన్నేసింది.ఆసీస్ బౌలర్లలో మెక్‌కే మూడు, హాస్ట్రింగ్స్ రెండు వికెట్లు తీశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు