మూడో వన్డేకు వర్షం ముప్పు!
పనాజీ,అక్టోబర్ 23: భారత్, ఆస్ట్రేలియా మధ్య గోవాలో ఆదివారం జరిగే మూడో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో అనేకప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్టల్రో ఆవరించి ఉన్న మేఘాలు సౌత్ కొంకణ్, గోవాల వైపు ప్రయాణం చేసే అవకాశం ఉందని వాతావరణ విభాగ డెరైక్టర్ కేవీ సింగ్ చెప్పారు. గోవాలో అక్టోబర్ నెలలో నిలకడగా వర్షాలు కురుస్తాయన్నారు. భారత్, ఆసీస్ల మధ్య జరుగుతున్న ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి వన్డే (కొచ్చి) వర్షం కారణంగా రద్దుకాగా... రెండో వన్డే (విశాఖపట్నం)లో ధోనిసేన విజయం సాధించింది. మూడో వన్డేకు వేదికైన జవ హర్లాల్ నెహ్రూ స్టేడియంలో భారత జట్టు శుక్రవారం మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. తర్వాత భారీ వర్షం కురిసింది. ఆస్ట్రేలియా జట్టు ఉదయమే ప్రాక్టీస్లో పాల్గొంది.
Comments