Friday, October 22, 2010

హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి స్వరాజ్ పాల్ సస్పెన్షన్

లండన్,అక్టోబర్ 22: బ్రిటన్ పెద్దల సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి భారత సంతతికి చెందిన స్వరాజ్ పాల్ సహా ముగ్గురు సభ్యులు సస్పెండయ్యారు. మిగిలిన ఇద్దరూ కూడా ఆసియన్ సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. స్వరాజ్ పాల్ పై  నాలుగు నెలల సస్పెన్షన్ విధించగా, బారోనెస్ మాంజిలా పోలా ఉద్దీన్ పై  పద్దెనిమిది నెలలు, అమీరాలీ అలీభాయ్ భాటియాపై ఎనిమిది నెలలు సస్పెన్షన్ విధిస్తూ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏకగ్రీవంగా తీర్మానం తీసుకుంది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై హౌస్ ఆఫ్ లార్డ్స్ హక్కుల కమిటీ వీరి సస్పెన్షన్ కు  సిఫారసు చేసింది. ఈ సిఫారసును హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏకగ్రీవంగా ఆమోదించింది. స్వరాజ్ పాల్ అవినీతికి పాల్పడకపోయినా, నిధుల వినియోగంలో నిర్హేతుకంగా, బాధ్యతారహితంగా వ్యవహరించారని హక్కుల కమిటీ తన దర్యాప్తులో నిర్ధారించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...