Friday, October 29, 2010
మహారాష్ర్ట సీఎంకు పదవీ గండం...
ముంబై, అక్టోబర్ 29న్యూస్లైన్: ‘ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల’ వివాదంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇది ఆయన పదవికి ఎసరు పెట్టే అవకాశముందని వార్తలొస్తున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి శనివారం ఢిల్లీలో కలవాల్సిందిగా చవాన్కు కబురు కూడా అందింది. ముంబై లోని కొలబా ప్రంతంలో కార్గిల్ మ్రుతులకు వుద్దేశించిన ఫ్లాట్లను కొందరు ప్రివేట్ వ్యక్తులు సొంతం చేసుకున్న కుంభకోణంలొ చవాన్ దగ్గరి బంధువు ల పేర్లు బయటకు వచ్చాయి. చవాన్ తీరుపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. చవాన్ను సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించే అవకాశముందని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు శుక్రవారం సాయంత్రం చవాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టుతో తనకు నేరుగా ఎలాంటి సంబంధం లేదన్నారు. సొసైటీలో తన అత్త భగవతితోపాటు మరో ఇద్దరు బంధువుల పేరిట ఉన్న ఫ్లాట్లను తిరిగి ఇచ్చేసినట్టు తెలిపారు. అలాగే మాజీ సైనికాధికారులు సైతం తమ ఫ్లాట్లను వాపసు ఇచ్చేస్తారని చెప్పారు. ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment