Tuesday, October 19, 2010
అమెరికాలో కరీంనగర్ యువకుని మృతి
డాలస్,అక్టోబర్ 19: అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రాచర్ల రాజేంద్రప్రసాద్(28) అనే తెలుగు యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. టెక్సాస్ రాష్ర్టలోని ఆస్టిన్ నగరంలో అక్టోబర్ 17న అతడు మరణించాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో త్రి అతడిని సెయింట్ డేవిడ్ నార్త్ ఆస్టిన్ ఆస్పత్రికి తరలించారు. మెదడు నాళాలు వాచాయని వైద్యులు గుర్తించారు. కోమాలోని వెళ్లిపోయిన రాజేంద్రప్రసాద్ బెయిన్డెడ్ అయ్యాడు. ఆ తర్వాత అతడు చనిపోయాడు. ట్రవీస్ కౌంటీ మెడికల్ సెంటర్ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ వస్తే గానీ అతడికి మృతి గల కారణాలు స్పష్టంగా తెలియవు.కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. మూడున్నరేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. ఆస్టిన్లోని చార్లెస్ షకవాబ్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే అతడికి వివాహమయింది. అతడి భార్య ర జని (25) మూడు నెలల క్రితమే ఇక్కడకి వచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment