Tuesday, October 19, 2010

చంద్రబాబు సహా నేతల అరెస్టు


హైదరాబాద్,అక్టోబర్ 19: సూక్ష్మ రుణ సంస్థల మోసాలతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ సమయం కేటాయించనందుకు నిరసనగా మంగళవారం తెలుగుదేశం, మిత్రపక్షాల నేతలు సికింద్రాబాద్ రసూల్‌పురా చౌరస్తాలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ధర్నా చేస్తున్న చంద్రబాబు సహా ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రధాని ఢిల్లీ బయలుదేరే సమయం వరకు మూడున్నర గంటలపాటు వారక్కడ ధర్నా కొనసాగించారు. తరువాత సొంత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు. ధర్నాలో టీడీపీ, పీఆర్‌పీ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్ నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఎం కూడా దూరంగా ఉండటం గమనార్హం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...