చంద్రబాబు సహా నేతల అరెస్టు


హైదరాబాద్,అక్టోబర్ 19: సూక్ష్మ రుణ సంస్థల మోసాలతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ సమయం కేటాయించనందుకు నిరసనగా మంగళవారం తెలుగుదేశం, మిత్రపక్షాల నేతలు సికింద్రాబాద్ రసూల్‌పురా చౌరస్తాలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ధర్నా చేస్తున్న చంద్రబాబు సహా ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రధాని ఢిల్లీ బయలుదేరే సమయం వరకు మూడున్నర గంటలపాటు వారక్కడ ధర్నా కొనసాగించారు. తరువాత సొంత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు. ధర్నాలో టీడీపీ, పీఆర్‌పీ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్ నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఎం కూడా దూరంగా ఉండటం గమనార్హం.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు