Wednesday, October 27, 2010

ఫలించిన రష్యా హిందువుల చిరకాల స్వప్నం

మాస్కో,అక్టోబర్ 27: : కృష్ణాలయం నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న రష్యాలోని హిందువుల చిరకాల వాంఛ ఎట్టకేలకు ఫలించింది. ఆలయం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ రష్యా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. రాజధాని మాస్కో శివారులోనినోవోడెన్‌స్కోయ్ ఉన్న వెరెస్కినో గ్రామంలో ఈ స్థలాన్ని కేటాయించారు. మాస్కో మేయర్ వ్లాదిమిర్ రెసిన్ ఇందుకు సంబంధించిన పత్రాలపై గతవారమే సంతకం చేశారు. మాస్కో సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్(మాస్కాన్) ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...