విశాఖలో భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే కు సర్వం సిద్ధం

విశాఖpaTnam,అక్టోబర్ 19:   విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే (డే-నైట్) జరుగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవడంతో ఈ మ్యాచ్‌కి ప్రాధాన్యం ఏర్పడింది. భారత్-ఆసీస్‌ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు బ్లాక్ టికెట్ల విక్రయం జోరుగా కొనసాగుతోంది. దీనిలో భాగంగానే బ్లాక్ టికెట్లు విక్రయిస్తుండగా ముగ్గురు పోలీసులుకు పట్టుబడిన ఘటన మంగళవారం వైఎస్‌ఆర్ స్టేడియం వద్ద చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరిలోనూ విశాఖలో జరిగే మ్యాచ్‌పై ఆసక్తి ఉండటంతో బ్లాక్ టికెట్లు అమ్మేవారికి వరంగా మారింది. టికెట్లు అమ్మకం జోరుగా సాగుtoeదని సమాచారం అందుకున్న పోలీసులు టికెట్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు