Friday, October 29, 2010

1956 నాటి తెలంగాణా కావాలి: కే.సీ.ఆర్.

హైదరాబాద్‌,అక్టోబర్ 29 : తెలంగాణ నుంచి ఇంచు భూమి పోయినా ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌, నల్గొండ జిల్లాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబోతున్నట్లుగా ఆంగ్ల పత్రికల్లో కథనాలొస్తున్నాయని, ఎవరి ప్రయోజనాలకోసం ఈ పని చేస్తున్నారని శ్రీకృష్ణ కమిటీని, ప్రధాని మన్మోహన్‌ను కేసీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ లేని తెలంగాణ తలకాయ లేని మొండెం లాంటిదని, తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజలను గోల్‌మాల్‌ చేసే ప్రక్రియ ఏదో జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని, అదే కనక జరిగితే ఆ తరువాత ఏమౌతుందో ఎవరూ ఊహించరని కేసీఆర్‌ హెచ్చరించారు. తమకు 1956 నాటి తెలంగాణ కావాలని ఆయన స్పష్టం ఆయ్చేశారు. ఏ ప్రాతిపధికన హైదరాబాద్'ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...