Thursday, September 23, 2010

కొవ్వును కరిగించే కొత్త మిషన్

లండన్, సెప్టెంబర్ 23:శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును  వదిలించుకునే ఓకొత్త మిషన్‌ను కనుగొన్నారు. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రాతం మీద ఓ జెల్ ప్యాచ్‌ని అతికించుకుంటే చాలు.. కొవ్వుకణాలను అది కరిగించేస్తుంది. తర్వా త కొద్దికాలంలోనే ఈ మృతకణాలు శరీరం నుంచి బయటకు పోతాయి. దాంతో సదరు వ్యక్తులు సన్నగా రివటల్లా కనిపిస్తా రు. ద జెల్‌టిక్ సంస్థ తయారుచేసిన ఈ మిషన్ ధర అర కోటికి పైమాటే.. అంటే, రూ. 56. 95 లక్షలన్న మాట! కొవ్వును తీసేయడానికి చేసే లిపోసక్షన్ అయితే చాలా బాధాకరంగా ఉం టుందని, ఇది ఏమాత్రం నొప్పి లేకుండా సన్నబరుస్తుందని శా స్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా, మొత్తం చికిత్సకు గంట నుంచి మూడుగంటల సమయం మాత్రమే పడుతుందట. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...