Thursday, September 30, 2010

అయోధ్యలో కొంత భాగమే రాముడికి...

లక్నో,సెప్టెంబర్ 30: : అయోధ్యలో వివాదస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టం చేసింది. ఇందులో ఒక భాగం హిందూ మహాసభకు, మరో భాగం సున్నీ వక్ఫ్ బోర్డ్ కు , మురో భాగం నిర్మోహీ అఖాడాకు చెందుతాయని పేర్కొంది. హిందూ విశ్వాసాల ప్రకారం అయోధ్య రామజన్మభూమేనని న్యాయమూర్తులు డీవీ శర్మ, సుధీర్ అగర్వాల్, ఎస్‌యూ ఖాన్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుతో ఒక జడ్జి విభేదించినట్టు సమాచారం. మూడు నె లల పాటు అక్కడ యథాత థ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. మూడు నెలల తర్వాతే ఏ కార్యకలాపామైనా చేపట్టేందుకు అనుమతిస్తామని తెలిపింది. హిందూ విశ్వాసాల ప్రకారం రాముడి విగ్రహాలు యధాస్థానంలో ఉంటాయని పేర్కొంది.జాతి యావత్తు ఉత్కంఠగా ఎదురు చూసిన వివాదస్పద అయోధ్య అంశం పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తన తీర్పు పాఠాన్ని 8,189 పేజీల్లో పొందు పరిచారు. న్యాయమూర్తులు డీవీ శర్మ, సుధీర్ అగర్వాల్, ఎస్‌యూ ఖాన్ విడివిడిగా తీర్పులిచ్చారు. జస్టిస్ అగర్వాల్ వెలువరించిన తీర్పును 5,238 పేజీల్లో 21 సంపుటాలుగా పొందుపరిచారు. జస్టిస్ డీవీ శర్మ 2,666 పేజీల్లో తీర్పు పాఠాన్ని ఉంచారు. జస్టిస్ ఎస్‌యూ ఖాన్ తన తీర్పును 285 పేజీల్లో నిక్షిప్తం చేశారు.కాగా, వివాస్పద అయోధ్య స్థలంపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని సున్నీ వక్ఫ్ బోర్డ్ తరపు న్యాయవాది తెలిపారు. వివాదస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలన్న కోర్టు తీర్పుపై తాము పూర్తిగా సంతృప్తి చెందడం లేదన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...