మరో వివాదంలో రెహ్మాన్ కామన్‌వెల్త్ పాట

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 12: : కామన్‌వెల్త్ క్రీడలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరచిన సంగీతాన్ని వివాదాలు వీడడం లేదు. తాజాగా, ఆయన స్వరపరచిన గీతాలకు ప్రదర్శన ఇచ్చేందుకు భారతీయ శాస్త్రీయ నృత్యంలోని కొందరు లబ్ధప్రతిష్టులైన నాట్యకారులు తిరస్కరించారు. వాస్తవానికి, భారతీయ శాస్త్రీయ నృత్యం గొప్పదనాన్ని వివరిస్తూ రెహ్మాన్ రూపొందించిన గీతానికి కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవాల్లో 11 నిమిషాలపాటు ప్రదర్శన ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. దీనికి సుమారు 500 మంది డ్యాన్సర్లతోపాటు పండిట్ బిర్జూ మహరాజ్, సరోజ్ వైద్యనాథన్, రాజారెడ్డి, సోనాల్ మాన్‌సింగ్, గురు సింఘాజిత్, భారతీ శివాజీలు ప్రదర్శన ఇస్తారని భావించారు. కానీ, తాజాగా, తమ ట్యూన్‌ను తామే స్వరపరచుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. "మేమిచ్చే సందేశం భిన్నంగా ఉంటుంది. అందుకని మా పాటను మేమే స్వరపరచుకుంటాం'' అని రాజారెడ్డి తెలిపారు. ఇప్పటికే కామన్‌వెల్త్ గేమ్స్ థీమ్ సాంగ్ పలు వివాదాల్లో కూరుకుంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు