Friday, September 10, 2010

ఖైరతాబాద్ వినాయకుడికి తాపేశ్వరం లడ్డూ

హైదరాబాద్,సెప్టెంబర్ 11: రాష్ట్రంలోనే పేరెన్నికగన్నఖైరతాబాద్ వినాయకుడికి తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన ప్రముఖ స్వీట్స్ వ్యాపారి సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తయారు చేసిన 500 కిలోల భారీ లడ్డూను శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం లడ్డూను తాపేశ్వరంలో ఊరేగించి గ్రామంలోని ప్రధాన దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రబద్ధంగా లడ్డూను మల్లిబాబు కుటుంబ సమేతంగా ప్రత్యేకంగా హైదరాబాద్‌కు తీసుకుని వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం వరకూ కొనసాగిన ఊరేగింపు అనంతరం శనివారం తెల్లవారుజాముకల్లా లడ్డూను హైదరాబాద్ పట్టణంలోని ఖైరతాబాద్ వినాయకుడికి నైవేథ్యంగా అందించనున్నారు.అలాగే విశాఖపట్టణంలోని గాజువాకలో ఉన్న వినాయకుడికి కూడా 100 కిలోల లడ్డూను, అయినవిల్లి వినాయకుడికి 50 కిలోల లడ్డూను, రామచంద్రపురం డఫేదార్ వినాయకుడిని 51 కిలోల లడ్డూ, బిక్కవోలు వినాయకుడికి 20 కిలోల లడ్డూను అందించినట్టు మల్లిబాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే భారీ స్థాయిలో లడ్డూను తయారు చేసి వినాయకుడికి అందించడం తనకెంతో గర్వంగా ఉందని, సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...