Tuesday, February 9, 2010

హైకోర్టుకు మహిళా చీఫ్‌ జస్టిస్‌గా మీనా కుమారి

హైదరాబాద్,ఫిభ్రవరి 9: రాష్ట్ర హైకోర్ట్ తాత్కా లిక ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్‌ టి. మీనాకుమారి నియ మితులయ్యారు. 1951 ఆగస్టు 3న విశాఖపట్నం యలమంచిలి గ్రామం లో జన్మించిన ఆమె బీఎస్సీ విద్యతో పాటు ఉస్మానియా విశ్వ విద్యా లయంలో న్యాయవిద్యను అభ్య సించారు. 1976 అక్టోబర్‌ 7నుంచి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తు న్నారు. సీనియర్‌ న్యాయవాది పి.శివశంకర్‌ వద్ద మీనా కుమారి జూనియర్‌ న్యాయవాదిగా పని చేశారు. ఆమె భర్త తూమ్‌ భీమ్‌సేన్‌ కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తు న్నారు. 1981 నుంచి 1984 వరకు అసిస్టెంట్‌ ప్రభుత్వ ప్లీడర్‌గా, 1988- 89 మధ్య కాలంలో ఇన్‌ కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. 1990లో హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా మీనాకుమారి నియమితులయ్యారు. 1994 వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు. విద్య, పౌరసరఫరాలు, కాలుష్య నియంత్రణ, విద్యుత్‌ వంటి విభాగాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహ రించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...