Friday, February 5, 2010

ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ భయం...పాస్ పోర్ట్ ల జారీ లో జాప్యం


హైదరాబాద్,ఫిభ్రవరి 5: హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలను ఔట్ సోర్సింగ్ విధానం కింద టాటా కన్సల్టెన్సీకు అప్పగిస్తున్నట్లు వార్తలు రావడంతో తమ ఉద్యోగాలపై భయంతో దక్షిణాది రాష్ట్రాలలోని కార్యాలయాలలోని ఉద్యోగులు పాస్‌ఫోర్టుల జారిలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో కూడా పోలీసు విచారణ పూర్తయిన తరువాత కూడా పాస్‌పోర్టులను జారీ చేయడం లేదని తెలుస్తోంది. ఈ రకంగా ఒక్క హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో సుమారు 70వేల పాస్‌పోర్టులను పెండింగ్‌లో పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గల్ఫ్ దేశాలలోని భారతీయ ఎంబసీలలో ఔట్ సోర్సింగ్ ద్వారా పాస్‌పోర్టుల జారీ, రెన్యువల్‌ను కేంద్ర ప్రభత్వం ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించారు. దీనితో దేశంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలను కూడా ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించడానికి రంగం సిద్ధమయింది. దీనితో ఉద్యోగులు భద్రత కొరవడి ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా పాస్‌పోర్టుల జారీలో జాప్యం చేస్తున్నట్లు చెబుతున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...