Tuesday, February 23, 2010

ఉస్మానియా లో మావోయిస్ట్ లపై ఆధారాలేవి? సుప్రింకోర్ట్

న్యూఢిల్లీ,ఫిభ్రవరి 23: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మావోయిస్టులు ఉన్నారంటూ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న వాదనకు ఆధారాలు ఇమ్మని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఉస్మానియాలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా విభాగం హెచ్చరికల కారణంగానే క్యాంపస్ లో పోలీసులను మోహరించినట్లు ప్రభుత్వం పదే పదే వినిపిస్తున్నది. అయితే, ఈ వాదనకు నిఘా విభాగం ఇచ్చిన నివేదికలను అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, నిఘా విభాగం నివేదికలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. దీనితో కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. జస్టిస్ జిఎన్ సింఘ్వి, జస్టిస్ అశోక్ కుమార్ ఈ కేసును విచారిస్తున్నారు. ఉస్మానియాలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా విభాగం సమాచారం కారణంగానే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా క్యాంపస్ లో పోలీసులు, కేంద్ర బలగాలను మొహరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనికి ఆధారం ఏమిటని అడిగిన న్యాయమూర్తులు జస్టిస్ జి.ఎన్. సింఘ్వి, జస్టిస్ అశోక్ కుమార్ లకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిఘా విభాగం నివేదికలే అని సమాధానం చెప్పారు. అయితే, ఆ నివేదికలను కోర్టు ముందు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను 25కు వాయిదా వేయడంతో అంతకు ముందు ఉస్మానియా క్యాంపస్ నుంచి పోలీసులను తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తొలగింపు ఆదేశాలపై స్టే ఉత్తర్వులు అప్పటి వరకూ కొనసాగుతాయని సుప్రీం కోర్టు ప్రకటించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...