హైదరాబాద్, ఫిబ్రవరి 11 : ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ నివేదిక పేర్కొంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో వైఎస్ సహా అధికారుల మాటలేవీ రికార్డు కాలేదని, కేవలం పైలట్ల సంభాషణ మాత్రమే రికార్డయిందని కమిటి గురువారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. వైఎస్ హెలికాప్టర్ బయలుదేరే ముందు, హెలికాప్టర్ చేరవలసిన చిత్తూరులోనూ వాతావరణం బాగానే ఉన్నదని, మధ్యలో కమ్యులో నింబస్ మేఘాల కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని నివేదికలో వెల్లడించారు. ప్రమాదం వెనుక కుట్ర కారణం అంశంపై సిబిఐ లోతుగా విచారిస్తోందని, మిగిలిన వివరాలు వారు వెల్లడిస్తారని సచివాలయంలో రోశయ్యను కలిసి నివేదిక సమర్పించిన అనంతరం కమిటి సభ్యులు విలేకర్లకు వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment