డాలస్‌లో 'వెండితెర వేదిక' ఆవిష్కరణ

డాలస్, ఫిబ్రవరి 9 : మొట్టమొదటిసారిగా ప్రవాసాంధ్రులు తెలుగు చలనచిత్రాలపై ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ వాసులు 'వెండితెర వేదిక' పేరుతో తెలుగు చలనచిత్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం మొదటి సమావేశం ఇటీవలే ఫన్ ఏషియా రిచర్డ్సన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వల కరుణాకర్ రావు తెలుగు సినిమా తొలిరోజుల గురించి ప్రస్తావించారు. మహాభారతంలోని కౌరవులు, పాండవులు ఒక్కరు కూడా లేకుండా మాయాబజారు సినిమా తీయడం విశేషమని ఆయన అన్నారు. డాక్టర్ జువ్వాడి రమణ తెలుగు సినిమాలలోని పద్యాల గురించి సోదాహరణంగా వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర నారాయణ్ దాసు తెలుగు హిందీ ప్రేక్షకుల అభిప్రాయ వ్యత్యాసాల గురించి ప్రస్తావించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు