Tuesday, February 9, 2010
డాలస్లో 'వెండితెర వేదిక' ఆవిష్కరణ
డాలస్, ఫిబ్రవరి 9 : మొట్టమొదటిసారిగా ప్రవాసాంధ్రులు తెలుగు చలనచిత్రాలపై ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ వాసులు 'వెండితెర వేదిక' పేరుతో తెలుగు చలనచిత్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం మొదటి సమావేశం ఇటీవలే ఫన్ ఏషియా రిచర్డ్సన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వల కరుణాకర్ రావు తెలుగు సినిమా తొలిరోజుల గురించి ప్రస్తావించారు. మహాభారతంలోని కౌరవులు, పాండవులు ఒక్కరు కూడా లేకుండా మాయాబజారు సినిమా తీయడం విశేషమని ఆయన అన్నారు. డాక్టర్ జువ్వాడి రమణ తెలుగు సినిమాలలోని పద్యాల గురించి సోదాహరణంగా వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర నారాయణ్ దాసు తెలుగు హిందీ ప్రేక్షకుల అభిప్రాయ వ్యత్యాసాల గురించి ప్రస్తావించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment