Saturday, February 13, 2010

అమెరికా వర్సిటీలో కాల్పులు : ఆంధ్రా ప్రొఫెసర్ మృతి


వాషింగ్టన్, ఫిబ్రవరి 13: అధ్యాపకురాలే ఉన్మాదిగా మారింది. చేతిలో పుస్తకం పట్టుకుని పాఠాలు చెప్పాల్సిన ఆ లేడీ టీచర్ రివాల్వర్‌తో చెలరేగిపోయింది. సహాధ్యాపకులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఆమె చేతిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొదిలి గోపీకృష్ణ అనే ప్రొఫెసర్‌తో సహాముగ్గురు మరణించారు. గోపీకృష్ణ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని అలబామా వర్సిటీ బయాలజీ విభాగం చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. హంట్స్‌విల్లెలోని అలబామా యూనివర్సిటలో శుక్రవారం సాయంత్రం బయాలజీ విభాగం అధ్యాపకుల సమావేశం ఏర్పాటు చేశారు. అమీ బిషప్ అనే అధ్యాపకురాలి పదవీకాలం పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడమే ఈ భేటీ అజెండా. గోపీ అధ్యక్షతన ఫ్యాకల్టీ మీటింగ్ జరిగింది. అమీ బిషప్ టెన్యూర్ పొడిగించరాదని ఈ సమావేశం నిర్ణయించింది. అంతే... ఆమెకు ఒక్కసారిగా కోపమొచ్చింది. తనను కాదనుకున్న వారందరిపైనా క క్ష పెంచుకుంది. అందరినీ హతమార్చాలనే ఉద్దేశం తో విచక్షణారక్షితంగా కాల్పులు జరిపింది. సమావేశ మందిరం రక్తసిక్తంగా మారింది. ప్రొఫెసర్ గోపీకృష్ణతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్లు మరి యా డే విస్, ఆడ్రియెల్ జాన్సన్‌లు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బయాలజీ విభాగం అధ్యాపకులే. కాల్పు లు జరిపిన అమీ బిషప్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఆమె భర్త జిమ్ అండర్సన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని స్కూళ్లు, యూనివర్సిటీలలో కా ల్పులు జరగడం ఇది కొత్త కాదు. 2007 ఏప్రిల్‌లో వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ఒక ఉన్మాది 32 మందిని చంపి తనూ కాల్చుకుని చనిపోయాడు. గతనెలలో వర్జీనియాలోనే జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. కాకపోతే... గతంలో విద్యార్థులే ఉన్మాదులుగా మారి కాల్పులు జరిపేవారు. అలబామా వర్సిటీలో మాత్రం అధ్యాపకురాలే దారుణానికి పాల్పడింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...