న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : ఐదుగురు సభ్యులతో కూడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఏడు అంశాలతో కూడిన విధివిధానాలను శుక్రవారం కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఈ కమిటీ కాలపరిమితి డిసెంబర్ 31, 2010 గా నిర్ణయించారు. కమిటీ విధి విధానాలు ఇవి: * తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్ల పరిశీలన * రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన అభివృద్ధిపై సమీక్ష * అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణ.. అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీల అభిప్రాయ సేకరణ * ముఖ్యంగా మొదటి మూడు అంశాలపై పరిశీలన * పరిశ్రమలు, వ్యాపార, రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు * రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయ సేకరణ.. రాజకీయ పార్టీలు సూచించే పరిష్కారాల పరిగణన * రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన పరిణామాల ప్రభావంపై సమీక్ష... ఇతర అంశాలపై సమీక్ష. శ్రీ క్రిష్ణ కమిటీ తొలి సమావీశం శనివారం నాడు ఢిల్లీలో జరుగుతుంది. కమిటీ కార్యాలయాన్ని త్వరలో హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారు. కాగా కమిటీ విధివిధానాల పత్ల టీ.ఆర్. ఎస్., తెలంగాణా జె.ఎ.సి.,ఉస్మానియా జె.ఎ.. సి., బీ.జే.పీ. అసంత్రుప్తి వ్యక్తం చేశాయి. ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment