Thursday, February 11, 2010

శాసనసభ్యురాలిగా వై.ఎస్. విజయలక్ష్మి ప్రమాణస్వీకారం


హైదరాబాద్, ఫిబ్రవరి 11 : దివంగిత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి పులివెందుల శాసనసభ్యురాలిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఛాంబర్‌లో విజయలక్ష్మిచేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజశేఖర్‌రెడ్డి మృతితో పులివెందులలో డిసెంబర్ 5, 2009లో జరిగిన ఉప ఎన్నికలలో వై.ఎస్. విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, డి. శ్రీనివాస్, పలువురు మంత్రులు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సమయంలో విజయలక్ష్మి ఎంతో వుద్వేగానికి లోనయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...