Tuesday, February 9, 2010

కాలిఫోర్నియాలో 'మనబడి' చిన్నారుల ప్రతిభ

సిలికానాంధ్ర, ఫిబ్రవరి 9 : సిలికానాంధ్ర మూడవ 'మనబడి' సాంస్కతికోత్సవం కాలిఫోర్నియాలోని సన్నీవేల్ హిందూదేవాలయంలో ఘనంగా జరిగింది. ఎనిమిది గంటల పాటు ఎంతో ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో 350 మంది పిల్లలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. వేదప్రవచనంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో ప్రవాసాంధ్రుల చిన్నారులు మధురమైన గీతాలు, పరమానందయ్య శిష్యుల కథలు, నీతి కథలు, నృత్యరూపకాలు, నీతి పద్యాల పఠనం, హాస్య నాటకాలను ప్రదర్శించారు. భువన విజయం నాటకంలో రాయల వారు, అష్టదిగ్గజాలు పద్యాలను వల్లించటం పిల్లలకు తెలుగు బాష పై ఉన్న పట్టుకు గీటురాయిగా నిలిచింది.సిలికానాంధ్ర చైర్మన్, వ్యవస్ధాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ, 13 కేంద్రాలతో ప్రారంభమైన 'మనబడి' మూడేళ్లలో 18 రాష్ట్రాలలో 785 విద్యార్ధుల వరకు ఎలా ఎదిగిందో వివరించారు. అలాగే ఈ సంవత్సరం నుండి 4నుండి 6 వయస్సు గల పిల్లలకోసం 'బాలబడి'ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రవేశం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అనే నాలుగు దశల్లో తెలుగు విద్యను సిలికానాంధ్ర మనబడి బోధిస్తున్నది. సిలికానాంధ్ర అధ్యక్షుడు చమర్తి రాజు మనబడికి స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ప్రశంసాపత్రాలతో సత్కరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...