Monday, February 8, 2010
ముస్లిం రిజర్వేషన్లను కొట్టివేసిన హైకోర్ట్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ముస్లింలలో వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ను కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం హైకోర్టు కొట్టివేసింది.ఏడుగురు సభ్యులతో కూడిన థర్మాసనం ఈ రిజర్వేషన్ రాజ్యాంగ బద్ధంగా లేదని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం 90 రోజులలో పై కోర్టుకు వెళ్ళవచ్చునని కూడా పేర్కొంది.దివంగిత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే దీనిపై వీహెచ్పి నాయకుడు మురళీధర్ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో రిజర్వేషన్లు నిలిపివేస్తూ అప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. త ర్వాత దీనిపై కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా కోర్టుో ఫిటిషన్లు దాఖలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment