Monday, February 8, 2010

ముస్లిం రిజర్వేషన్లను కొట్టివేసిన హైకోర్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ముస్లింలలో వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం హైకోర్టు కొట్టివేసింది.ఏడుగురు సభ్యులతో కూడిన థర్మాసనం ఈ రిజర్వేషన్ రాజ్యాంగ బద్ధంగా లేదని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం 90 రోజులలో పై కోర్టుకు వెళ్ళవచ్చునని కూడా పేర్కొంది.దివంగిత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే దీనిపై వీహెచ్‌పి నాయకుడు మురళీధర్ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో రిజర్వేషన్లు నిలిపివేస్తూ అప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. త ర్వాత దీనిపై కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా కోర్టుో ఫిటిషన్లు దాఖలు చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...