Tuesday, February 2, 2010
బెజవాడ దారుణం లో పోలీస్ వైఫల్యం
హైదరాబాద్,ఫిబ్రవరి 2: దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విజయవాడ బాలిక 11 యేళ్ళ నాగవైష్ణవికి ,కూతురి మరణంతో గుండె ఆగిన ఆమె తండ్రి ప్రభాకర్కు యావత్ రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. మొత్తం ఈ ఉదంతం లో పోలీస్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కిడ్నాప్ చేసిన బాలికను దుండగులు తీసుకుపోయిన గుంటూరు బెజవాడ కు పట్టుమని గంట దూరం కూడా లేదు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా ఇక్కడ అప్రమత్తమైపోయే పోలీసులు బెజవాడ కు కనీసం ఆ పక్కనున్న ఏలూరు, ఈ పక్కనున్న గుంటూరు ను ఎలెర్ట్ చేయలేకపోవడం దురద్రుష్టకరం. కిడ్నాప్ లో బాలిక మేనమామల పాత్రపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ పోలీసులు ఆ దిశగా అడుగు వేసిన జాడే లేదు. సబితా ఇంద్రరెడ్డీ హయాంలో రాష్ట్ర హోం శాఖ, పోలీస్ యంత్రాంగం వీక్ అయిందన్న వాదనకు వైష్ణవి ఉదంతం అద్దం పడుతోంది. ఇలావుండగా, రాష్ట్రం మొత్తాన్ని విషాదంలో దాన్ని నింపిన నాగవైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులను శిక్షించేందుకు అవసరమైతే ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. గతనెల 23నుంచి అన్నీ విషాదవార్తలే వింటున్నామని, వైష్ణవి హత్యతో ఇది పరాకాష్టకు చేరిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment