Saturday, February 13, 2010

పుణెలో బాంబు పేలుడు: 8 మంది మృతి

పుణె,ఫిభ్రవరి 14: మహారాష్ట్రలోని పూణెలో ఓషో ఆశ్రమం సమీపంలోని జర్మన్ బేకరీలో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా, 32 మంది వరకు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని ససూన్ ఆసుపత్రికి తరలించారు. విదేశీయులే లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగినట్లు భవిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు విదేశీయులు ఉండగా, నలుగురు విదేశీయులు గాయపడినట్లు తెలుస్తున్నది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించినా, అనంతరం మృతుల సంఖ్య పెరుగడంతో కేంద్ర హోంశాఖ దీనిని బాంబు పేలుడుగా ప్రకటించింది. పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగ్‌ను ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ బాంబు పేలుడుతో ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తమైంది. దేశ రాజధాని సహా హైదరాబాద్, బెంగుళూరు మరికొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలో మరిన్ని చోట్ల దాడులు జరిగే అవకాశం ఉండడంతో అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది ఉగ్రవాదుల పనేనని, పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీబీఐ బృందాలు మరొక అనుమానాస్పద బ్యాగు లభ్యం కావడంతో దానిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...