Wednesday, January 27, 2010
మేడారం జాతర షురూ
వరంగల్,జనవరి 27: అడవితల్లి బిడ్డలు సమ్మక్క – సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం నుంచి సమ్మక్క – సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభం అయింది. 7.30 గంటలకు సారలమ్మను గద్దెకు చేర్చారు. గద్దెకు సారలమ్మ చేరుకోవడంతో ఈ మహాజాతర మొదలయింది. రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే సమ్మక్క – సారలమ్మ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి లక్షలా మంది భక్తులు తరలివస్తారు. పూనుగండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్ద రాజును, కొండాయి నుంచి సమ్మక్క మేనల్లుడు గోవిందరాజును కూడా గద్దెకు తీసుకువస్తారు. చిలకలగట్టు నుంచి గురువారంనాడు సమ్మక్కను మేళతాళాలతో, డప్పు చప్పుళ్ళతో వేడుకగా తీసుకువస్తారు. తరువాత తల్లీబిడ్డలయిన సమ్మక్క – సారలమ్మలు గద్దెపై కొలువుదీరిన తరువాత భక్తులు తమ తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ జాతరలో ముఖ్యంగా భక్తులు మొక్కుకున్న ప్రకారం తమ నిలువెత్తు బంగారం (బెల్లం) దేవతలకు సమర్పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment