Wednesday, January 27, 2010

టీమిండియా ఘన విజయం

ఢాకా,జనవరి 27: బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ, ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. బుధవారం లంచ్ విరామానంతరం బంగ్లాదేశ్ 312 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో భారత్ విజయానికి కేవలం రెండు పరుగుల కోసం రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ – గౌతం గంభీర్ లతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వ్యక్తిగత పరుగులేవీ చేయకుండానే విజయం వరించింది. బంగ్లా ఓపెనింగ్ బౌలర్, కెప్టెన్ సఖీబుల్ హసన్ వేసిన రెండు బంతులూ బై స్ గా రెండు పరుగులు ఇచ్చాడు. ఈ విజయంతో భారత జట్టు శ్రీలంక పర్యటనలో భాగంగా నిర్వహించిన రెండు టెస్ట్ ల సీరీస్ ను 2 – 0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టిన జహీర్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...