Wednesday, January 27, 2010
టీమిండియా ఘన విజయం
ఢాకా,జనవరి 27: బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ, ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. బుధవారం లంచ్ విరామానంతరం బంగ్లాదేశ్ 312 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో భారత్ విజయానికి కేవలం రెండు పరుగుల కోసం రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ – గౌతం గంభీర్ లతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వ్యక్తిగత పరుగులేవీ చేయకుండానే విజయం వరించింది. బంగ్లా ఓపెనింగ్ బౌలర్, కెప్టెన్ సఖీబుల్ హసన్ వేసిన రెండు బంతులూ బై స్ గా రెండు పరుగులు ఇచ్చాడు. ఈ విజయంతో భారత జట్టు శ్రీలంక పర్యటనలో భాగంగా నిర్వహించిన రెండు టెస్ట్ ల సీరీస్ ను 2 – 0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టిన జహీర్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment