సీమాంధ్ర సమైక్య జేఏసీకి కాంగ్రెస్ దూరం

హైదరాబాద్,జనవరి 21: టీడీపీ ప్రతిపాదించిన సమైక్య ఆంధ్ర ఐక్య కార్యాచరణ సమితిలో తాము చేరడం లేదని ప్రభుత్వ విప్‌ శైలజానాథ్‌ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు, సారూప్యత కలిగిన అంశాలపై పోరాటం చేసేందుకు టీడీపీలో కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరాలు లేవన్నారు. సమైక్య నినాదానికి అనుకూలంగా ప్రజా సంఘాలతో, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా శైలజానాథ్‌ స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు