Thursday, January 28, 2010

వచ్చేవారంలో తెలంగాణా పై కమిటీ

నూఢిల్లి,జనవరి 28: తెలంగాణ వివాదంపై కేంద్ర మంత్రి చిదంబరం మరోసారి స్పందించారు. సమస్య పరిష్కారం తుది దశలో ఉందని వెల్లడించారు. ఫిబ్రవరి మొదటి వారంలో కమిటీ వేయనున్నట్లు స్ఫష్టం చేశారు. శాంతిభధ్రతలకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ వద్దని విజ్ఞప్తి చేసారు. ఇలావుండగా, కమిటీలపై తమకు నమ్మకం లేదని ఉస్మానియా జె.ఎ.సి. తెలిపింది. తెలంగాణా పై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరో వైపు చిదంబరం తాజా ప్రకటన పై చర్చించేందుకు తెలంగాణా జె.ఎ.సి. హైదరాబాడ్ లో సమావేశమవుతొంది. కేంద్ర ప్రకటన రాకపోతే తెలంగాణా ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయాలన్న తెలంగాణా జె.ఎ.సి. గడువు గురువారం సాయంత్రం తో ముగిసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...