Friday, January 29, 2010

చానెల్ కొంటున్న లోకేష్?

హైదరాబాద్,జనవరి 29: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ లోకేష్ ఒక ఛానల్ కు అధిపతి అవుతున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యుఎస్ లోని స్ఠాన్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబిఎ అభ్యసించి 2009 ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చేసారు. ఇక్కడ తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే లోకేష్ కు మీడియా వ్యవహారాలపై ఆసక్తి ఉండటంతో అటు వైపుగా కొద్ది రోజులుగా ఆలోచనలు సాగిస్తున్నారు. తన బంధువులకు చెందిన నార్ని గ్రూప్ నకు చెందిన స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ కొద్దిరోజులుగా ప్రసారాలు సాగిస్తోంది. ఈ ఛానల్ అధినేత నార్నే శ్రీనివాస్ తన తండ్రి చంద్రబాబుకు స్వయానా మేన కొడలికి భర్త. దీంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వంతో ఆ ఛానల్ ను కొనుగోలు చేసి సారథ్యం వహించేందుకు లోకేష్ రంగం సిద్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 40 కోట్ల రూపాయులు చెల్లించి ఆ ఛానల్ ను లోకేష్ తన వశం చేసుకోనున్నట్టు భోగట్టా. అంతేగాక లోకేష్ యుఎస్ లో చదువుతున్న సమయంలో అక్కడ తన మిత్రుడొక్రిని ఆ ఛానల్ కు సీఈఓ గా నియామకం చేసినట్లు తెలిసింది. అలాగే ఛానల్ పేరుతో పాటుగా, రూపురేఖలు మార్చి మంచి రేటింగ్ తేవాలన్న సంకల్పంతో లోకేష్ ఉన్నట్లు సమాచారం. లోకేష్ ఛానల్ ను కొనుగోలు చేసారన్న అంశంపై స్టూడియో ఎన్ అధినేత నార్నే శ్రీనివాస్ కొట్టిపారేయలేదు. లోకేష్ చానల్ పట్ల ఆసక్తిగా ఉన్న మాట నిజమేనని, అయితే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. లోకేష్ మిత్రుడు అభీష్త్ సిఈఓ గా బాధ్యతలు చేపట్టడం కూడా వాస్తవేమేనని ఆయన ధృవీకరించారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నార్నే శ్రీనివాస్ కూతుర్నే జూనియర్ ఎంటీఆర్ పెళ్ళి చేసుకోబోతుండడం కొసమెరుపు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...