Sunday, January 24, 2010

రెండవ టెస్ట్ పై భారత్ పట్టు


ఢాకా,జనవరి 24: రెండవ, ఆఖరి టెస్ట్ లో భారత్ జట్టు బంగ్లా పై ఆది లోనే పట్టు బిగించింది. తొలి రోజునే 233 పరుగులకు బంగ్లాను ఆలౌట్ చేసిన భారత్ ఆట ముగిసే సమయనికి వికెట్ నస్టపోకుండా 69 పరుగులు చేసింది. సెహ్వాగ్ 41 పరుగులతోనూ, గంభీర్ 21 పరుగులతోనూ ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టులో మహ్మదుల్లా 96 పరుగులు మినహా ఇతర బ్యాట్స్ మెన్లెవరూ రాణించ లేదు. ఇషాంత్ శర్మ 4 వికెట్లు, జహీర్ఖాన్ 3 వికెట్లు తీసుకున్నారు. రెండు టెస్ట్ ల ఈ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యత తో వుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...