Saturday, January 23, 2010

తెలంగాణా కోసం చావద్దు...బ్రతకండి: సుష్మాస్వరాజ్ పిలుపు


హైదరరాబాద్,జనవరి 23: ప్రత్యేక తెలంగాణా కొసం విధ్యార్థులు జరుపుతున్న పోరాటానికి బీజేపీ మద్దతు ఇస్తుందని పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ప్రకటించారు. అఖిలభారతీయ విధ్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన విధ్యార్ధి రణభేరి మహాసభలో ఆమె ప్రసంగించారు. తలంగాణా కొసం ఆత్మహత్యలు చేసుకొవద్దని, త్వరలో యేర్పదే కొత్త రాస్ట్రాన్ని చూసుకునేందుకు జీవించాలని ఆమె పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడాలంటే ఇంకెంత మంది చావాలని ప్రశ్నించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆమె కోరారు. తెలంగాణపై భారతీయ జనతాపార్టీ అభిప్రాయాన్ని మరొక్కసారి స్ఫష్టంగా చెప్పేందుకే హైదరాబాదు వచ్చానని ఆమె తెలిపారు. ప్రతి విషయం పరిశీలించాకే ఎలాంటి శషబిషలు లేకుండా తమ పార్టీ తెలంగాణపై తీర్మాణం చేసిందని సుష్మా వివరించారు. తమ బతుకు తాము బతుకుతామన్న తెలంగాణ వారి వాదనలో న్యాయముందని సుష్మాస్వరాజ్‌ అన్నారు. తెలంగాణా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విధ్యార్ధులు ఈ సభకు తరలివచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...