తెల్గీకి నాలుగేళ్ళ జైలు
హైదరాబాద్,జనవరి 22: నకిలీ స్టాంపుల కేసులో తెల్గీ తో పాటు ఐదుగురు నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నాలుగు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది. 500 రూపాయల జరిమానా కూడా విధించిన న్యాయస్థానం దానిని చెల్లించకపోతే మరో నెల రోజులు జైలుశిక్ష అనుభవించాలని పేర్కొంది. తెల్గీ తో పాటు ఐదుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో కోర్ట్ తన తీర్పును వెలువరించింది.
Comments