Wednesday, January 27, 2010

ఉద్యోగులకు 39 శాతం ఫిట్ మెంట్

హైదరాబాడ్,జనవరి 27: పిఆర్సీ సిఫార్సులపై ప్రభుత్వం – ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. 2010 ఫిబ్రవరి నెల నుంచి 39 శాతం ఫిట్ మెంట్ అమలుకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. పెరిగిన ఫిట్ మెంట్ కారణంగా రాష్ట్ర ఖజానాపై నెలకు 2,700 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. పెరిగిన జీతం మార్చి నెల నుంచి నగదుగా వస్తుంది. ఫిబ్రవరి నెలలో పెరిగిన జీతాన్ని జిపిఎఫ్ లో కలుపుతామని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగ సంఘాల నాయకులు 40 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, మానిటరీ బెనిఫిట్ 2009 నుంచి అమలు చేయాలని పట్టు పట్టారు. కాగా, 39 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు, 2010 ఫిబ్రవరి నెల నుంచి మానిటరీ బెనిఫిట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొంత తర్జన భర్జనల అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం ఉద్యోగ సంఘాలతో ఇతర డిమాండ్లపై చర్చలు జరుపుతామని ప్రభుత్వం తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...