పడవ ప్రమాదంలో 11 మంది దుర్మరణం

హైదరాబాద్, జనవరి 30: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపు తిప్ప వద్ద శనివారం నాడు గోదావరి పాయలో నాటు పడవ బోల్తా పడిన దుర్ఘటన లో 11 మంది మ్రుతదేహాలు వెలికి తీశారు. గల్లంతైన మరో 14 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మాఘ పౌర్ణిమ సందర్భంగా దాదాపు 60 మంది అంతర్వేది వెడుతుండగా అధిక బరువు వల్ల పడవ బోల్తా పడింది. దాదాపు 35 మందిని స్థానికులు రక్షించారు. మ్రుతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం ప్రకటించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు