Saturday, January 30, 2010

పడవ ప్రమాదంలో 11 మంది దుర్మరణం

హైదరాబాద్, జనవరి 30: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపు తిప్ప వద్ద శనివారం నాడు గోదావరి పాయలో నాటు పడవ బోల్తా పడిన దుర్ఘటన లో 11 మంది మ్రుతదేహాలు వెలికి తీశారు. గల్లంతైన మరో 14 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మాఘ పౌర్ణిమ సందర్భంగా దాదాపు 60 మంది అంతర్వేది వెడుతుండగా అధిక బరువు వల్ల పడవ బోల్తా పడింది. దాదాపు 35 మందిని స్థానికులు రక్షించారు. మ్రుతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం ప్రకటించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...