జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో -నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు

హైదరాబాద్, మే 15: మ్యాట్రిక్స్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ను.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను మంగళవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసింది. సోమ, మంగళవారాల్లో నాలుగు దఫాలుగా ప్రసాద్‌ను విచారించిన సీబీఐ అధికారులు.., ఆయన్ను అరెస్టు చేసినట్టుగా రాత్రి 10.30 సమయంలో ప్రకటించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ను, ఐఆర్‌టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) అధికారి బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేశామని,  బుధవారం  న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని చెప్పారు.
జగతి పబ్లికేషన్స్ లో నిమ్మగడ్డ ప్రసాద్ తనకు చెందిన నాలుగు కంపెనీల ద్వారా రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి గాను 11.77 శాతం వాటా పొందారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు