Friday, November 12, 2010

ప్రముఖ సినీ నిర్మాత డి.వి.ఎస్ . రాజు కన్నుమూత

 
హైదరాబాద్,నవంబర్ 13: ప్రముఖ సినీ నిర్మాత డి.వి.ఎస్ . రాజు శనివారం తెల్లవారుఝామున మరణించారు.  ఆయన వయసు 82 సంవత్సరాలు. డి.వి.ఎస్ .ప్రొడక్షన్స్ పతాకం పై మంగమ్మ శ పధం, పిడుగు రాముడు, తిక్కశంకరయ్య, గండి కోట రహస్యం,చిన్ననాటి స్నేహితులు,ధనమా-దైవమా,జీవన జ్యోతి వంటి పలు ప్రజాదరణ పొందిన చిత్రాలను ఆయన నిర్మించారు.విశ్వనాధ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన  జీవన జ్యోతి చిత్రం  బంగారు నంది గెలుచుకుంది. జాతీయ చలనచిత్ర పరిశ్రమాభివ్రుద్ధి సంస్థ అధ్యక్షునిగాను, రాష్ట్ర ఫిలిం చాంబర్ అధ్యక్షునిగాను డి.వి.ఎస్ . రాజు  పని చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...