Friday, November 12, 2010
ప్రముఖ సినీ నిర్మాత డి.వి.ఎస్ . రాజు కన్నుమూత
హైదరాబాద్,నవంబర్ 13: ప్రముఖ సినీ నిర్మాత డి.వి.ఎస్ . రాజు శనివారం తెల్లవారుఝామున మరణించారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. డి.వి.ఎస్ .ప్రొడక్షన్స్ పతాకం పై మంగమ్మ శ పధం, పిడుగు రాముడు, తిక్కశంకరయ్య, గండి కోట రహస్యం,చిన్ననాటి స్నేహితులు,ధనమా-దైవమా,జీవన జ్యోతి వంటి పలు ప్రజాదరణ పొందిన చిత్రాలను ఆయన నిర్మించారు.విశ్వనాధ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన జీవన జ్యోతి చిత్రం బంగారు నంది గెలుచుకుంది. జాతీయ చలనచిత్ర పరిశ్రమాభివ్రుద్ధి సంస్థ అధ్యక్షునిగాను, రాష్ట్ర ఫిలిం చాంబర్ అధ్యక్షునిగాను డి.వి.ఎస్ . రాజు పని చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
No comments:
Post a Comment